భారతీయుల వీసాలపై జరిమానా మాఫీ చేసిన యూఏఈ
ABN , First Publish Date - 2020-08-08T13:11:33+05:30 IST
భారతీయుల వీసాలపై విధించిన వేల దిర్హామ్ల అపరాధ రుసుమును యూఏఈ మాఫీ చేసింది. కరోనా కారణంగా యూఏఈలో చిక్కుకుపోయి మార్చి 1 నాటికి వీసాల కాలపరిమితి ముగిసిన భారతీయులకు ఇది ఊరటనిచ్చే విషయమే.
దుబాయి, ఆగస్టు 7: భారతీయుల వీసాలపై విధించిన వేల దిర్హామ్ల అపరాధ రుసుమును యూఏఈ మాఫీ చేసింది. కరోనా కారణంగా యూఏఈలో చిక్కుకుపోయి మార్చి 1 నాటికి వీసాల కాలపరిమితి ముగిసిన భారతీయులకు ఇది ఊరటనిచ్చే విషయమే. ఇప్పటికే 145 మంది భారతీయులు ఈ ప్రయోజనాన్ని పొందారని భారత రాయబారి నీరజ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారు కూడా ఎలాంటి జరిమానాలు లేకుండానే స్వదేశానికి తిరిగి వెళ్లొచ్చని చెప్పారు.