కరోనా రోగుల సహాయానికి ‘మిషన్ హౌస్లా’ కార్యక్రమం

ABN , First Publish Date - 2021-05-11T18:44:58+05:30 IST

కరోనా రోగులకు ఆక్సిజన్, బెడ్స్, ప్లాస్మా అందించేందుకు ఉత్తరాఖండ్ పోలీసు శాఖ ముందుకు వచ్చింది....

కరోనా రోగుల సహాయానికి ‘మిషన్ హౌస్లా’ కార్యక్రమం

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): కరోనా రోగులకు ఆక్సిజన్, బెడ్స్, ప్లాస్మా అందించేందుకు ఉత్తరాఖండ్ పోలీసు శాఖ ముందుకు వచ్చింది. మిషన్ హౌస్లా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి కరోనా రోగులకు సాయం అందిస్తోంది పోలీసుశాఖ. కరోనా రోగులకు సాయం చేయడంతోపాటు పేద ప్రజలకు రేషన్, మృతదేహాల దహనానికి తరలించేందుకు అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నామని ఉత్తరాఖండ్ పోలీసు డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. ప్రజల నుంచి విరాళాలు తీసుకొని పేదలు, కరోనా రోగులకు సాయం అందిస్తున్నామని డీజీపీ చెప్పారు. రెండు టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేసి కరోనా రోగులకు సేవలందిస్తున్నామని డీజీపీ వివరించారు. ప్రతీ పోలీసుస్టేషన్ నోడల్ కేంద్రంగా 665  ఆక్సిజన్ సిలిండర్లను అందించామని డీజీపీ పేర్కొన్నారు. ఆసుపత్రిలో పడకలు అవసరమైన రోగులకు బెడ్స్ ఇప్పించామన్నారు. 5వేల మందికి రేషన్ అందించామని డీజీపీ వివరించారు.289 కరోనా మృతదేహాలను దహనం చేశామని డీజీపీ వివరించారు.

Updated Date - 2021-05-11T18:44:58+05:30 IST