Udaipur హంతకుడు రియాజ్‌కు బీజేపీతో సంబంధాలు? వెలుగుచూసిన ఫొటో

ABN , First Publish Date - 2022-07-02T17:17:13+05:30 IST

ఉదయపూర్ నగరంలో టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రధాన నిందితులు రియాజ్ అత్తారి, మహ్మద్ గౌస్‌లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకొని జరిపిన విచారణలో కీలక విషయాలు...

Udaipur హంతకుడు రియాజ్‌కు బీజేపీతో సంబంధాలు? వెలుగుచూసిన ఫొటో

జైపూర్(రాజస్థాన్): ఉదయపూర్ నగరంలో టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రధాన నిందితులు రియాజ్ అత్తారి, మహ్మద్ గౌస్‌లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకొని జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి.టైలరు హత్యకు ముందు వీరిద్దరూ గతంలో బీజేపీలోకి చేరేందుకు ప్రయత్నించి ఉండవచ్చని వెల్లడైంది.ఇద్దరు హంతకుల్లో ఒకరైన రియాజ్ అత్తారి బీజేపీ కార్యక్రమాల్లో తన విధేయుల ద్వారా ప్రవేశించినట్లు తెలుస్తోంది.రియాజ్ కు రాజస్థాన్‌ రాష్ట్రంలోని బీజేపీ మైనారిటీ మోర్చా సభ్యుడు ఇర్షాద్ చైన్‌వాలా పూలదండ వేసి స్వాగతిస్తున్న చిత్రం తాజాగా వెలుగుచూసింది. 2019వసంవత్సరంలో రియాజ్ సౌదీ అరేబియా మక్కా తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతన్ని స్వాగతిస్తున్నట్లు చిత్రం వెలుగుచూసింది. 


స్థానిక బీజేపీ యూనిట్‌ నేత చైన్‌వాలాతో నిందితుడు రియాజ్ కు  దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా అనుబంధం ఉందని తేలింది.  రియాజ్ ఉదయపూర్‌లో బీజేపీ కార్యక్రమాలకు హాజరయ్యేవాడని చైనావాలా చెప్పారు.రియాజ్ తరచుగా ఆహ్వానం లేకుండా పార్టీ ఈవెంట్లలో కనిపించాడని దర్యాప్తులో వెల్లడైంది.ఉదయపూర్ నగరంలో టైలర్ కన్హయ్యాలాల్ పై ఘోరమైన దాడి జరిగిన రోజున ఇద్దరు హంతకులు ఉపయోగించిన మోటార్-బైక్ నంబర్ ప్లేటుపై ఆర్ జే  27 ఏఎస్ 2611 అని ఉంది. ముంబైపై అతిపెద్ద ఉగ్రవాద దాడి జరిగిన రోజు నంబరు ప్లేటుపై ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.ఈ బైక్‌ను రియాజ్ పేరు మీద రిజిస్టర్ చేసి ఉంది.




Updated Date - 2022-07-02T17:17:13+05:30 IST