Udayanidhi బ్యానర్ ఏర్పాటు చేసిన హెడ్ కానిస్టేబుల్పై చర్య తీసుకోండి
ABN , First Publish Date - 2022-05-22T14:40:52+05:30 IST
ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ‘నెంజుక్కు నీతి’ చిత్రం శుక్రవారం రీలీజ్ అయింది. దీన్ని పురస్కరించుకుని పెరంబలూరు జిల్లాకు చెందిన హెడ్కానిస్టేబుల్ కదిరవన్ బ్యానరును
- డీజీపీకి అన్నాడీఎంకే ఫిర్యాదు
అడయార్(చెన్నై): ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ‘నెంజుక్కు నీతి’ చిత్రం శుక్రవారం రీలీజ్ అయింది. దీన్ని పురస్కరించుకుని పెరంబలూరు జిల్లాకు చెందిన హెడ్కానిస్టేబుల్ కదిరవన్ బ్యానరును కట్టారు. దీనిపై అన్నాడీఎంకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై పెరంబలూరు పట్టణ పోలీస్ స్టేషనులో హెడ్ కానిస్టేబుల్ కదిరవన్పై ఒకే కేసు నమోదైంది. ఒక ప్రభుత్వ ఉద్యో గిగా ఉండి బ్యానర్ కట్టడంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, పార్టీ న్యాయవాదుల విభాగం సహాయ కార్యదర్శి బాబు మురుగవేల్ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇది పోలీస్ చట్టం 29 సెక్షన్ కింద నేరమని పేర్కొన్నారు. అందు వల్ల అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.