Nupur Sharma వ్యాఖ్యలతో దేశం అవమానం పాలైంది...సీఎం ఉద్ధవ్ థాకరే కామెంట్
ABN , First Publish Date - 2022-06-09T17:50:27+05:30 IST
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు....
ముంబై: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.వారం రోజుల క్రితం జాతీయ టెలివిజన్లో జరిగిన చర్చలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా దేశం అవమానాన్ని చవిచూడాల్సి వచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ లౌడ్స్పీకర్లు, ఇతర విషయాలపై వివాదాలు సృష్టిస్తోందని థాకరే ఆరోపించారు.జమ్మూ కశ్మీర్లో ఇటీవల జరిగిన హత్యలను ప్రస్తావిస్తూ కశ్మీరీ పండిట్ల పరిస్థితిపై దృష్టి పెట్టాలని సీఎం థాకరే సూచించారు. దివంగత సేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే చేసిన సాయం వల్లనే శివసేన చిరకాల మిత్రపక్షమైన బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోగలిగిందని థాకరే అన్నారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శివలింగంపై చేసిన వ్యాఖ్యను థాకరే స్వాగతించారు.