ఉగాది, శ్రీరామనవమి పురస్కారాల ప్రదానం

ABN , First Publish Date - 2021-04-21T04:31:58+05:30 IST

సింహపురి సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో పలువురికి ఉగాది, శ్రీరామనవమి పురస్కారాలు అందచేశారు. నగర పుర మందిరంలో మెజీషియన్‌ రాంజీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఉగాది, శ్రీరామనవమి పురస్కారాల ప్రదానం
పురస్కారం ప్రదానం చేస్తున్న నిర్వాహకులు

నెల్లూరు(సాంస్కృతిక ప్రతినిధి), ఏప్రిల్‌ 20 : సింహపురి సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో పలువురికి ఉగాది, శ్రీరామనవమి పురస్కారాలు అందచేశారు. నగర పుర మందిరంలో మెజీషియన్‌ రాంజీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. సంఘ సేవకురాలు పర్వీన్‌, యాంకర్‌ అర్చన, కవులు పీ రామకృష్ణ, పెరుగు సుజనారామం, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి మధురవాణి, సంఘ సేవకుడు సుంకర ఆదినారాయణ, రంగస్థల నటులు వీఎల్‌ నారాయణరావు, పిన్ను గంగాధర్‌రెడ్డి, మెజీషియన్‌ ఎంఎస్‌ రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, సీఐ వేమారెడ్డి, డాక్టర్‌ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్‌ బీ రాజేష్‌, నృత్య కళాకారిణి నదియ, నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, వైజాగ్‌ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం రాజకిషోర్‌కు పురస్కారాలు అందజేశారు.

Updated Date - 2021-04-21T04:31:58+05:30 IST