ఒమాన్‌లో ఉత్తేజాన్ని నింపిన ‘తెలుగు కళా సమితి’ ఉగాది సంబరాలు

ABN , First Publish Date - 2022-04-21T01:42:58+05:30 IST

ఒమాన్ ... గల్ఫ్ లోని ఇతర దేశాలతో పోల్చితె ఎక్కువ కాలం కరోనా ఆంక్షలను అమలు చేసిన దేశం. ఇప్పుడిప్పుడే క్రమంగా ఆంక్షలు సడలిస్తూ జనసమీకరణలు, సమావేశాలకు అనుమతిస్తోంది.

ఒమాన్‌లో ఉత్తేజాన్ని నింపిన ‘తెలుగు కళా సమితి’ ఉగాది సంబరాలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఒమాన్ ... గల్ఫ్ లోని ఇతర దేశాలతో పోల్చితె ఎక్కువ కాలం కరోనా ఆంక్షలను అమలు చేసిన దేశం. ఇప్పుడిప్పుడే క్రమంగా ఆంక్షలు సడలిస్తూ జనసమీకరణలు, సమావేశాలకు అనుమతిస్తోంది. ఈ సందర్భంగా తెలుగు ప్రవాసీయులు నూతన తెలుగు సంవత్సరం శ్రీ శుభకృత్ నామ ఉగాది ఉత్సవాన్ని రాజధాని మస్కట్‌లో పూర్తిగా నూతన ఉత్తేజంతో, ఉత్సాహంగా జరుపుకోన్నారు.



తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ రాయబార కార్యాలయంలో సంక్షేమ విభాగం అధికారి ఇర్షాద్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఒమాన్‌లో ప్రవాసాంధ్రులలో తెలుగు సంస్కృతి కొరకు తెలుగు కళా సమితి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా గాయిని గాయకులు శ్రీనిధి తిరుమల, వెంకట దుర్గా, హనుమాన్ చవటపల్లిలు తమ పాటలతో సభికులను ఆలరింపజేశాయి. సంప్రదాయ జానపద నృత్యాలు మరియు సినీ పాటలతో చిన్నారులు కూడ సభికులను ఆకట్టుకోన్నారు.  హైద్రాబాద్‌లోని శుభోదయం గ్రూప్ సంస్ధ చెర్మెన్ లక్ష్మి ప్రసాద్ కూడ ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్, కో కన్వీనర్ చిన్న మరియు కుమార్, సీతారాం, శ్రీదేవి, సూరపునని చైతన్య,రాణి, రాజశేఖర్, ఆనంద్, చరణ్, శ్రీధర్, మూర్తి తదితరులు ఏర్పాట్లను పరిశీలించినట్లుగా నిర్వహకులు తెలిపారు.


Updated Date - 2022-04-21T01:42:58+05:30 IST