మరో నాలుగు వారాలు కరోనా నిబంధనలు.. ప్రకటించిన ప్రధాని
ABN , First Publish Date - 2021-06-15T06:19:01+05:30 IST
ఇంగ్లండ్ దేశంలో మరో నాలుగు వారాలపాటు లాక్డౌన్ కొనసాగుతుందని, అప్పటి వరకూ కరోనా నిబంధనలు కొనసాగుతాయని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.
లండన్: ఇంగ్లండ్ దేశంలో మరో నాలుగు వారాలపాటు లాక్డౌన్ కొనసాగుతుందని, అప్పటి వరకూ కరోనా నిబంధనలు కొనసాగుతాయని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ డెల్టా వేరియంట్ వైరస్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో లాక్డౌన్ తొలగించడం సమంజసం కాదని బోరిస్ జాన్సన్ అన్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నాలుగు వారాల కన్నా ఎక్కువ లాక్డౌన్ అవసరం లేదని అనుకుంటున్నా. జూలై 19 దాటి ాక్డౌన్ విధించాల్సిన అవసరం రాదనే అనుకుంటున్నా’’ అని బోరిస్ జాన్సన్ తెలిపారు.