ఉక్రెయిన్ నుంచి 65 మంది విద్యార్థుల రాక
ABN , First Publish Date - 2022-03-08T17:10:58+05:30 IST
యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్ నుంచి సోమవారం ఉదయం మరో 65 మంది విద్యార్థులు రాష్ట్రానికి సురక్షితంగా చేరుకున్నారు. దీంతో ఇంతవరకు తిరిగొచ్చిన విద్యార్థుల సంఖ్య 500 దాటింది. మరో 163
బెంగళూరు: యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్ నుంచి సోమవారం ఉదయం మరో 65 మంది విద్యార్థులు రాష్ట్రానికి సురక్షితంగా చేరుకున్నారు. దీంతో ఇంతవరకు తిరిగొచ్చిన విద్యార్థుల సంఖ్య 500 దాటింది. మరో 163 మంది విద్యార్థులు రెండు మూడు రోజుల్లో వాపసు రావచ్చునని అంచనా వేస్తున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే రుమేనియా, పోలెండ్ సరిహద్దుల్లో తమవంతు విమానాలకోసం పడిగాపులు కాస్తున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ గంగ పేరిట ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను ఇంత వరకు 51 విమానాలలో సురక్షితంగా మనదేశానికి తరలించారు. ఢిల్లీనుంచి సోమవారం కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్న 65 మంది విద్యార్థుల బృందాన్ని అధికారులు స్వాగతించారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సులలో వారి సొంత జిల్లాలకు పంపించారు.