Chennai చేరిన మరో 68 మంది..

ABN , First Publish Date - 2022-03-09T14:44:18+05:30 IST

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా చిక్కుల్లో పడిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గంగపేరుతో సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే అనేక వేల మంది విద్యార్థులను తరలించారు. వీరిలో

Chennai చేరిన మరో 68 మంది..

అడయార్‌(చెన్నై): ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా చిక్కుల్లో పడిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గంగపేరుతో సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే అనేక వేల మంది విద్యార్థులను తరలించారు. వీరిలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో 68 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి నగరానికి వచ్చారు. తొలుత ఢిల్లీకి చేరుకున్న వీరిని అక్కడ నుంచి చెన్నైకు విమానంలో తీసుకొచ్చారు. దీనిపై ఎంపీ అబ్దుల్లా మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధానాకి తాత్కాలిక విరామం ప్రకటించిందనీ అందువల్ల ఉక్రెయిన్‌ దేశంలోని సుమి నగరంలో చిక్కుకున్న తమిళ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2022-03-09T14:44:18+05:30 IST