పెంపుడు శునకం విశ్వాసం...యజమాని మృతదేహాన్ని వీడని వైనం
ABN , First Publish Date - 2022-04-05T14:28:55+05:30 IST
పెంపుడు శునకం తన యజమానిపై విశ్వాసం చూపించిన ఘటన ఉక్రెయిన్ యుద్ధ భూమిలో వెలుగుచూసింది....
Ukraineలోని కైవ్ నగరంలో రష్యా మారణకాండకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం
కైవ్: పెంపుడు శునకం తన యజమానిపై విశ్వాసం చూపించిన ఘటన ఉక్రెయిన్ యుద్ధ భూమిలో వెలుగుచూసింది. రష్యా సైనికుల దాడుల్లో ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపైనే మరణించాడు. యుద్ధంలో మరణించిన తన యజమాని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉండగా ఆయన పెంపుడు శునకం ఆ మృతదేహాన్ని వీడి వెళ్లడం లేదు. యజమాని శవమై పడి ఉండటంతో దాని పక్కనే అతని పెంపుడు శునకం కూర్చొని ఉన్న చిత్రం మంగళవారం మీడియాలో వెలుగుచూసింది.1930వ సంవత్సరంలో మరణించిన తన యజమాని కోసం 9 ఏళ్ల పాటు ఎదురు చూసిన జపనీస్ కుక్క హచికో ఉదంతాన్ని ఉక్రెయిన్ శునకం గుర్తు చేస్తోంది.రష్యా దాడుల్లో రాజధాని నగరమైన కైవ్ లో వేలాదిమంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా దాడుల్లో బుచా పట్టణంలోనూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.