పెంపుడు శునకం విశ్వాసం...యజమాని మృతదేహాన్ని వీడని వైనం

ABN , First Publish Date - 2022-04-05T14:28:55+05:30 IST

పెంపుడు శునకం తన యజమానిపై విశ్వాసం చూపించిన ఘటన ఉక్రెయిన్ యుద్ధ భూమిలో వెలుగుచూసింది....

పెంపుడు శునకం విశ్వాసం...యజమాని మృతదేహాన్ని వీడని వైనం

Ukraine‌లోని కైవ్ నగరంలో రష్యా మారణకాండకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం 

కైవ్: పెంపుడు శునకం తన యజమానిపై విశ్వాసం చూపించిన ఘటన ఉక్రెయిన్ యుద్ధ భూమిలో వెలుగుచూసింది. రష్యా సైనికుల దాడుల్లో ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపైనే మరణించాడు. యుద్ధంలో మరణించిన తన యజమాని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉండగా ఆయన పెంపుడు శునకం ఆ మృతదేహాన్ని వీడి వెళ్లడం లేదు. యజమాని శవమై పడి ఉండటంతో దాని పక్కనే అతని పెంపుడు శునకం కూర్చొని ఉన్న చిత్రం మంగళవారం మీడియాలో వెలుగుచూసింది.1930వ సంవత్సరంలో మరణించిన తన యజమాని కోసం 9 ఏళ్ల పాటు ఎదురు చూసిన జపనీస్ కుక్క హచికో ఉదంతాన్ని ఉక్రెయిన్ శునకం గుర్తు చేస్తోంది.రష్యా దాడుల్లో రాజధాని నగరమైన కైవ్ లో వేలాదిమంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా దాడుల్లో బుచా పట్టణంలోనూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 


Updated Date - 2022-04-05T14:28:55+05:30 IST