ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులపై దాడికి కారణం అదే: మంత్రి వీకే సింగ్‌

ABN , First Publish Date - 2022-04-06T15:24:00+05:30 IST

ఉక్రెయిన్‌ సరిహద్దులో వృద్ధులను తోసేయడం వల్లే భారతీయ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని, ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్నందున కాదని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మంగళవారం లోక్‌సభలో చెప్పారు.

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులపై దాడికి కారణం అదే: మంత్రి వీకే సింగ్‌

వృద్ధుల్ని తోసినందుకే దాడి.. 

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: ఉక్రెయిన్‌ సరిహద్దులో వృద్ధులను తోసేయడం వల్లే భారతీయ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని, ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్నందున కాదని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మంగళవారం లోక్‌సభలో చెప్పారు. ‘ఉక్రెయిన్‌లో పరిస్థితి’పై జరిగిన చర్చ సందర్భంగా వీకే సింగ్‌ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులు చాలా దూరం నడవాల్సి వచ్చిందని, 25 కిలోమీటర్ల పొడవునా జామ్‌లో చిక్కుకుపోయారని పేర్కొన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌ వాసులు సరిహద్దు దాటి పోలండ్‌కు వెళ్లేందుకు భారీగా రావడంతో భారతీయ విద్యార్థులకు సరిహద్దును దాటే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.

Updated Date - 2022-04-06T15:24:00+05:30 IST