గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-02-26T05:36:54+05:30 IST
మండలంలోని కంభంపాడు పరిసర ప్రాంతాల్లోని పొలాలలో గురువారం కాలిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.
సీఎ్సపురం, ఫిబ్రవరి 25 : మండలంలోని కంభంపాడు పరిసర ప్రాంతాల్లోని పొలాలలో గురువారం కాలిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ చుక్కా శివబసవరాజు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 38 సంవత్సరాలున్న వ్యక్తి గుర్తు పట్టలేని స్థితిలో కాలిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా హత్య చేసి కాల్చారా..? అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.