వేధింపులు భరించలేక బావిలో దూకి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-26T01:47:42+05:30 IST
హనుమకొండ: భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్లో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి డిగ్రీ విద్యార్థిని బలైంది. తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ
హనుమకొండ: భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్లో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి డిగ్రీ విద్యార్థిని బలైంది. తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు వంశీ. వంశీ వేధింపులు భరించలేక శ్వేత అనే డిగ్రీ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్వేత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్వేతను పొట్టన పెట్టుకున్న వంశీని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.