ఒక్కసారిగా ఆ అమ్మాయికి ఏమైందో.. ఎవరితోనూ మాట్లాడడం లేదు.. ఆరోగ్యం బాగలేక ఆస్పత్రికి వెళితే.. అక్కడ తెలిసింది షాకింగ్ నిజం
ABN , First Publish Date - 2021-11-24T15:35:17+05:30 IST
కౌన్సెలింగ్లో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ తన మనసులో బాధను చెప్పేసరికి విన్నవారంతా షాక్కు గురయ్యారు...
ఆ అమ్మాయికి ఏమైందో కాని ఒక్కసారిగా మాట్లాడడం మానేసింది. ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ ఉండే ఆమె.. ఒక్కసారిగా మూగబోయింది. ఏదో పోగొట్టుకున్నట్లు దిగాలుగా ఉంది. అన్నం కూడా తినడం లేదు. ఆరోగ్యం క్షీణించగానే తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అమ్మాయి మానసికంగా ఏదో సమస్యతో బాధపడుతోందని.. కౌన్సెలింగ్కి పంపిచారు.
కౌన్సెలింగ్లో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ తన మనసులో బాధను చెప్పేసరికి విన్నవారంతా షాక్కు గురయ్యారు. ఇంత దారుణం జరిగిందా.. అని ఆశ్చర్యపోయారు. అసలు ఏమైందంటే..
ఢిల్లీలో నివసించే సిమ్రన్(15, పేరు మార్చబడినది) తల్లిదండ్రులు కొన్ని నెలల క్రితం ఆమెను తన బాబాయ్ ఇంట్లో వదిలి పనిమీద వేరే ఊరు వెళ్లారు. సిమ్రన్కు పరీక్షలు ఉండడంతో ఆమె చదువుకుంటోంది. అలా తన బాబాయ్ ఇంట్లో చదువుకుంటుండగా.. ఒక్కసారిగా వెనుక నుంచి ఆమెను ఎవరో గట్టిగా పట్టుకున్నారు. వెనుక తిరిగి చూస్తే అదెవరో కాదు స్వయాన తన బాబాయ్.
కూతురి వరుస అయిన సిమ్రన్ను తన కోరిక తీర్చమని వావి వరుస మరచిన ఆ మృగాడు చెప్పాడు. అందుకు సిమ్రన్ ఒప్పుకోకపోవడంతో ఆమెను కొట్టాడు. ఆమెను చంపేస్తానని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆమెపై అత్యాచరం చేశాడు. ఇదంతా వీడియోగా చిత్రీకరించాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడతానని భయపడించాడు.
అప్పటినుంచి సిమ్రన్ ఈ ఘటనని తలుచుకుంటూ మనోవేదనకు గురైంది. ఎవరికీ చెప్పుకోలేక తనలోతాను బాధపడుతూ మానసికంగా కుంగిపోయింది. ఆమె ఆరోగ్యం క్షీణించగా తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిమ్రన్కు కౌన్సెలింగ్ చేయగా.. తనపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డ బాబాయ్ గురించి చెప్పుకొని మనసారా ఏడ్చింది. దీంతో సిమ్రన్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు వారి ఫిర్యాదు మేరకు సిమ్రన్ బాబాయ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు అతని ఇంటికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.