ఉక్కు పరిరక్షణకు రాజీలేని పోరాటాలు

ABN , First Publish Date - 2021-07-27T06:13:13+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

ఉక్కు పరిరక్షణకు రాజీలేని పోరాటాలు
రిలే నిరాహార దీక్షల శిబిరంలో పాల్గొన్న ఉక్కు కార్మికులు

పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జూలై 26: స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 165వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో  డబ్ల్యూఎండీ, యుటిలిటీస్‌, ఈఎండీ, ఈఎన్‌ఎండీ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 29న జరబోయే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు, ఇతర నాయకులు వరసాల శ్రీనివాసరావు, కె.సత్యనారాయణ, రామ్మోహన్‌ కుమార్‌, మస్తానప్ప, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T06:13:13+05:30 IST