ఉక్కు పరిరక్షణకు రాజీలేని పోరాటాలు
ABN , First Publish Date - 2021-07-27T06:13:13+05:30 IST
స్టీల్ప్లాంట్ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు.
పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, జూలై 26: స్టీల్ప్లాంట్ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెం జంక్షన్లో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 165వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో డబ్ల్యూఎండీ, యుటిలిటీస్, ఈఎండీ, ఈఎన్ఎండీ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 29న జరబోయే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు, ఇతర నాయకులు వరసాల శ్రీనివాసరావు, కె.సత్యనారాయణ, రామ్మోహన్ కుమార్, మస్తానప్ప, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.