వైసీపీ పాలనలో యువత భవిష్యత్ అగమ్యగోచరం
ABN , First Publish Date - 2022-08-13T05:22:02+05:30 IST
రాష్ట్రంలో మూడేళ్ల వైసీపీ పాలన లో యువత భవిష్యత్ అగమ్యగో చరంగా మారిందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతి నిధి ఆర్జే వెంకటేశ్ దుయ్యబట్టారు.
మదనపల్లె టౌన్, ఆగస్టు 12: రాష్ట్రంలో మూడేళ్ల వైసీపీ పాలన లో యువత భవిష్యత్ అగమ్యగో చరంగా మారిందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతి నిధి ఆర్జే వెంకటేశ్ దుయ్యబట్టారు. శుక్రవారం స్థానికటీడీపీ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ దేశమంతా అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపు కుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళు తున్నారన్నారు. ఉన్నత విద్యావంతులు ఉద్యోగావకాశాలు లేక వలంటీర్లుగా మారుతు న్నారన్నారు. రాబోయే రోజుల్లో జగన్ను వదిలించుకుంటే నే యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తెలుగు యు వత అధి కార ప్రతినిధి శివకృష్ణ, విజయమ్మ, శ్యామల, వెంకటేష్, నవీన్, నాగజ్యోతి పాల్గొన్నారు.
కురబలకోటలో: యువత దేశానికి వెన్నె ముక లాంటివారని వైస్ ప్రిన్సిపాల్ రమనా థమ్ పేర్కిన్నారు. శుక్రవారం మండలంలోని అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత చేతుల్లోనే దేశభవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. కార్యక్రమంలో విబాగాధిపతి నవీన్కుమార్, అల్తాఫ్ అలీ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.