Guwahati: వెలుగులోకి గుర్తు తెలియని మృతదేహాలు.. తలలు పట్టుకుంటున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-06-07T22:16:09+05:30 IST

అసోంలోని గువాహటిలో పోలీసులు ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ట్రాన్స్‌పోర్టు

Guwahati: వెలుగులోకి గుర్తు తెలియని మృతదేహాలు.. తలలు పట్టుకుంటున్న పోలీసులు

గువాహటి: అసోంలోని గువాహటిలో పోలీసులు ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయం (DTO) సమీపంలో మురికి కాలువ పక్కన పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడు ఎలా మరణించాడన్న విషయం తెలియరాలేదు. అయితే, హత్యే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 


ఇలాంటి ఘటనే ఒకటి గణేశ్‌గురి  బస్టాప్ వద్ద జరిగింది. అక్కడ కూడా ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే కాదు, నగరంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమవుతుండడం మిస్టరీగా మారింది. వీటిలో చాలా వరకు హత్యలేనని నిర్ధారించిన పోలీసులు.. సాక్ష్యాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. 

Updated Date - 2022-06-07T22:16:09+05:30 IST