పూచీకత్తు లేకుండా రైతులకు లోన్: యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా

ABN , First Publish Date - 2021-12-01T00:19:16+05:30 IST

పూచీకత్తు లేకుండా రైతులకు లోన్ ఇస్తామని యూనియన్

పూచీకత్తు లేకుండా రైతులకు లోన్: యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా

విజయవాడ: పూచీకత్తు లేకుండా రైతులకు లోన్ ఇస్తామని యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కిసాన్ తత్కాల్ పథకం ద్వారా క్రాప్ లోన్ తీసుకున్న రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.50వేల లోన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. కొవిడ్, ఆర్థిక మాంద్యం, తుపాను కారణంగా దెబ్బతిన్న అన్ని జిల్లాల్లోని రైతులు, మహిళలు, ప్రజలకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 



Updated Date - 2021-12-01T00:19:16+05:30 IST