జిల్లా వాసికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రశంసలు

ABN , First Publish Date - 2021-03-07T05:13:28+05:30 IST

జిల్లా విద్యాశాఖ రీసోర్స్‌ పర్సన్‌గా, నందిమండలం జడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తున్న గునిశెట్టి శ్రీనివాసులుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ నుంచి వ్యక్తిగతంగా ప్రత్యేక ప్రశంసలు లభించాయు.

జిల్లా వాసికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రశంసలు
కేంద్ర మంత్రి పంపిన ప్రశంసాపత్రం

కడప (ఎడ్యుకేషన్ల్‌), మార్చి 6 : జిల్లా విద్యాశాఖ రీసోర్స్‌ పర్సన్‌గా, నందిమండలం జడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తున్న గునిశెట్టి శ్రీనివాసులుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ నుంచి వ్యక్తిగతంగా ప్రత్యేక ప్రశంసలు లభించాయు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మెయిల్‌ ద్వారా ఈ మేరకు సందేశం అందుకున్నారు. కేంద్ర బడ్జెట్‌ 2021-22 సంబంధించి ఈయన మైజీవోవి.ఇన్‌ పోర్టల్‌ ద్వారా పంపిన వివిధ అంశాల సూచనలు విలువైనవిగా భావిస్తూ కేంద్ర బృందానికి అవి తోడ్పడినట్లు తెలియజేస్తూ ఆ మేరకు మెయిల్‌ ద్వారా ధన్యవాదాలు తెల్పుతూ ప్రశంసా సందేశాన్ని పంపించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారిణి శైలజతో పాటు పలువురు గునిశెట్టి శ్రీనివాసులును అభినందించారు. 

Updated Date - 2021-03-07T05:13:28+05:30 IST