ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

ABN , First Publish Date - 2022-01-12T01:07:31+05:30 IST

ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు గడువును కేంద్ర

ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు గడువును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్నుల దాఖలు గడువును 2022 మార్చి 15 వరకు పొడిగించినట్లు మంగళవారం ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. పన్ను చెల్లింపుదారులు, సంబంధిత ఇతరులు కోరిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 


కోవిడ్-19 మహమ్మారితోపాటు, ఆడిట్ రిపోర్టులను ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పన్ను చెల్లింపుదారులు, సంబంధిత ఇతరులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఐటీ రిటర్నుల దాఖలు గడువును 2022 మార్చి 15 వరకు పొడిగించినట్లు పేర్కొంది. 


Updated Date - 2022-01-12T01:07:31+05:30 IST