TS News: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-01T22:19:11+05:30 IST

Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) బీహార్ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishna Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం కాదన్నారు. అసలు కేసీఆర్‌ను జాతీయస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణను ఉద్దరించానని

TS News: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) బీహార్ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishna Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం కాదన్నారు. అసలు కేసీఆర్‌ను జాతీయస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణను ఉద్దరించానని దేశమంతా తిరిగి చెబుతున్నారు. బీహార్‌లో నిన్న కేసీఆర్ మాటలు వినలేక నితీష్కుమార్ లేచి వెళ్లే పరిస్థితి. తెలంగాణ రైతులు గోస పడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అంటే తెలంగాణ రైతులను పట్టించుకోక పోవడమే తెలంగాణ మోడలా?’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2022-09-01T22:19:11+05:30 IST