Kishan reddy: కేసీఆర్ కుటుంబం మొత్తం కూర్చున్నా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదు
ABN , First Publish Date - 2022-08-20T18:37:39+05:30 IST
కేసీఆర్ కుటుంబం మొత్తం కుర్చీ వేసుకుని కూర్చున్నా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
నల్గొండ: కేసీఆర్ (KCR) కుటుంబం మొత్తం కుర్చీ వేసుకుని కూర్చున్నా మునుగోడులో టీఆర్ఎస్ (TRS) గెలవదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు. రేపు మునుగోడులో జరిగే బీజేపీ (BJP) బహిరంగ సభ ఏర్పాట్లను కిషన్రెడ్డి (Union minister), ఎమ్మెల్యే ఈటల (Etela rajender) శనివారం పరిశీలించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ... అధికార పార్టీ అభద్రతాభావం, గందరగోళంలో ఉందన్నారు. అమిత్షా (Amith shah) సభకు ఒక్కరోజు ముందు కేసీఆర్ (CM KCR) సభ.. వారి భయాన్ని తెలియజేస్తోందని తెలిపారు. హుజూరాబాద్ గెలుపును ఓర్వలేకే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మాటలగారడీ చేయడం కేసీఆర్ (KCR)కు వెన్నతో పెట్టిన విద్యన్నారు. ఉపఎన్నికలు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఏ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శమో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల (BJP MLA)ను ఓడించేందుకే దళితబంధు తెచ్చారని... అయినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు బీజేపీని గెలిపించారన్నారు. రాజగోపాల్రెడ్డి (Rajagopal reddy) నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. రేపటి బీజేపీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.