యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-07-05T05:07:51+05:30 IST

రాష్ట్రంలో దశాబ్దలుగా పని చే స్తున్న అన్ని యూనిర్సిటీల అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని పాల మూరు యూనివర్సిటీ టీచింగ్‌ అసోసియేషన్‌ (పుటా) అధ్యక్షుడు డాక్టర్‌ భూమయ్య డిమాండ్‌ చేశారు.

యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి
పీయూ పరిపాలన భవనం ఎదుట నిరసన చేస్తున్న పీయూ అధ్యాపకులు

- పుటా అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ భూమయ్య

- పీయూ పరిపాలన భవనం ఎదుట నిరసన

పాలమూరు యూనివర్సిటీ, జూలై4: రాష్ట్రంలో దశాబ్దలుగా పని చే స్తున్న అన్ని యూనిర్సిటీల అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని పాల మూరు యూనివర్సిటీ టీచింగ్‌ అసోసియేషన్‌ (పుటా) అధ్యక్షుడు డాక్టర్‌ భూమయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం పీయూ పరిపాలన భవనం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం ఏలాంటి ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయకుండా అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకు లు రవికుమార్‌, రంగప్ప, విజయ్‌ భాస్కర్‌, మృదుల, సుజాత పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:07:51+05:30 IST