ప్రత్తిపాడు పొదల్లో గుర్తుతెలియని మృతదేహం
ABN , First Publish Date - 2022-05-29T06:32:37+05:30 IST
ప్రత్తిపాడు పొదల్లో గుర్తుతెలియని మృతదేహం
పెంటపాడు, మే 28: ప్రత్తిపాడులో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ జి.సత్యనారాయణ తెలిపారు. ప్రత్తిపాడు బైపాస్ జంక్షన్ వద్ద పొదల్లో మృతదేహం ఉందని వీఆర్ఏ అహరోన్ వీఆర్వో బుల్లమ్మాయికి తెలిపాడన్నారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్లు ఉండవచ్చని పేర్కొన్నారు.