రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-11T06:31:23+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం

మామునూరు, మే 10 : వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి మామునూరు చెరువు కట్ట వద్ద ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టి వెళ్లిపోయిందని, చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడని మామునూరు సీఐ రమేష్‌ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి సమాచారం లేదని, అతడి వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉంటుందని, నలుపు, తెలుపు రంగు డబ్బాల చొక్కా, నలుపు రంగు పాయింట్‌ ధరించి ఉన్నాడని, మాసిపోయిన గడ్డం, బట్టలతో మతి స్థిమితంలేనట్లుగా కనపడుతున్నాడని ఆయన వివరించారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే మామునూరు పోలీసుస్టేషన్‌-73822 94054, ఎస్‌ఐ-94407 95228, సీఐ-94910 89138లకు సమాచారం అందించాలని సీఐ రమేష్‌ కోరారు. 


Updated Date - 2021-05-11T06:31:23+05:30 IST