రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదు: ఉన్నం వెంకటేశ్వరరావు

ABN , First Publish Date - 2022-04-17T01:18:32+05:30 IST

రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదని రాజధాని అమరావతి పుస్తక రచయిత ఉన్నం వెంకటేశ్వరరావు అన్నారు.

రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదు: ఉన్నం వెంకటేశ్వరరావు

అమరావతి: రాజధానిని తరలించడం ఎవరివల్ల కాదని  రాజధాని అమరావతి పుస్తక రచయిత ఉన్నం వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం 'ఆంధ్రుల రాజధాని అమరావతి' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ పుస్తకావిష్కరణలో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2016లో రాజధాని మొదటి ప్రచురణను చంద్రబాబు విడుదల చేశారన్నారు.అమరావతి రాజధాని కోసం 852 రోజులుగా ఉద్యమిస్తున్నామని చెప్పారు. అమరావతి రైతుల త్యాగాలను పుస్తకంలో రాసినట్లు తెలిపారు.అమరావతిలో ఒక సెంటు భూమి కూడా లేదన్నారు. ఒక సామాజికవర్గానికి మాత్రమే రాజధాని అన్నవారికి.. పుస్తకంలో పూర్తి విషయాలు వెల్లడించామని ఉన్నం వెంకటేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2022-04-17T01:18:32+05:30 IST