తెర్చుకోని గొర్రెగుట్ట ప్రాథమిక పాఠశాల

ABN , First Publish Date - 2022-06-28T04:34:07+05:30 IST

మండలంలోని గొర్రెగుట్ట ప్రాథమికపాఠశాల సోమవారం ఉపాధ్యాయుడు రాక పోవడంతో తెర్చుకోలేదు. పాఠశాలలో 1నుంచి 5వరకు తరగతులు కొనసాగుతుండగా గతేడాది 22మంది విద్యా ర్థులు ఉండగా ఈ విద్యాసంవత్సరం 16మంది ఉన్నారు.

తెర్చుకోని గొర్రెగుట్ట ప్రాథమిక పాఠశాల
ఉపాధ్యాయుడి కోసం వేచి చూస్తున్న విద్యార్థులు

- పర్యవేక్షణ కరువు

- పట్టించుకోని ఉన్నతాధికారులు

దహెగాం, జూన్‌ 27: మండలంలోని గొర్రెగుట్ట ప్రాథమికపాఠశాల సోమవారం ఉపాధ్యాయుడు రాక పోవడంతో తెర్చుకోలేదు. పాఠశాలలో 1నుంచి 5వరకు తరగతులు కొనసాగుతుండగా గతేడాది 22మంది విద్యా ర్థులు ఉండగా ఈ విద్యాసంవత్సరం 16మంది ఉన్నారు. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం మూడు రోజులు మాత్రమే పాఠ శాలకు హాజరైనట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చివరికి విద్యార్థుల తల్లిదండ్రులు మరో తాళంవేసి మండల విద్యాధికారికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు.

రెగ్యులర్‌ ఉపాధ్యాయుడిని నియమిస్తాం 

- భిక్షపతి, ఇన్‌చార్జి ఎంఈవో

బడిబాట కార్యక్రమం ముగియగానే గొర్రెగుట్ట ప్రాథమిక పాఠశాలకు డిప్యూ టేషన్‌పై రెగ్యులర్‌ ఉపాధ్యాయుడిని నియమిస్తాం. పాఠశాల ప్రతిరోజు తెరు చుకునేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-06-28T04:34:07+05:30 IST