ఎన్నికల పేరుతో అశాంతి: ఆనందబాబు

ABN , First Publish Date - 2021-03-06T00:14:29+05:30 IST

రాష్ట్రంలో ఎన్నికల పేరుతో అశాంతి నెలకొందని టీడీపీ నేత,

ఎన్నికల పేరుతో అశాంతి: ఆనందబాబు

 గుంటూరు: రాష్ట్రంలో ఎన్నికల పేరుతో అశాంతి నెలకొందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పల్లెల్లో పెట్టిన చిచ్చులనే నేడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణాల్లో కూడా పెడుతున్నారని ఆయన ఆరోపించారు.


ఎన్నో రకాల అరాచకాలు చేసి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నామినేషన్ వేసిన అభ్యర్థులను దాచుకోవాల్సిన పరిస్థితులు రాష్టంలో ఏర్పాడ్డాయని ఆయన విమర్శించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని నక్కా ఆనందబాబు అన్నారు. 

Updated Date - 2021-03-06T00:14:29+05:30 IST