నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు

ABN , First Publish Date - 2021-03-01T04:47:14+05:30 IST

ప్రభుత్వం పంచాయతీల్లో చెత్తను సేకరించి ఆ చెత్త ద్వారా పంచాయతీని అభివృద్ధి పరిచేందుకు నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.

నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు
పుత్తనవారిపల్లె వద్ద రోడ్డు పక్కనే వేస్తున్న చెత్త

రోడ్డు పక్కనే పేరుకుపోతున్న చెత్త

పుల్లంపేట, ఫిబ్రవరి28 : ప్రభుత్వం పంచాయతీల్లో చెత్తను సేకరించి ఆ చెత్త ద్వారా పంచాయతీని అభివృద్ధి పరిచేందుకు నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రతి పంచాయతీలో లక్షలు వ్యయం చేసి నిర్మించిన ఈ చెత్త సంపద కేంద్రాలు పిచ్చిమొక్కలతో నిండి ఉన్నాయి. పంచాయతీలో సేకరించిన చెత్తను చెత్తసంపద కేంద్రాల్లో కాకుండా రోడ్డు పక్కనే వేస్తున్నారు. దీంతో చెత్త సంపద కేంద్రాలు శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడింది. పుల్లంపేట మండలంలో అన్ని పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించారు. ప్రస్తుతం అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. పుత్తనవారిపల్లె పంచాయతీలో సేకరించిన చెత్తను హైవే రోడ్డు పక్కనే వేస్తున్నారు. రోజురోజుకు రోడ్డు పక్కనే చెత్త పేరుకుపోతోంది. చెత్త సంపద కేంద్రాలు మాత్రం పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. దీంతో లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు వినియోగంలోకి రాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. 



Updated Date - 2021-03-01T04:47:14+05:30 IST