తెలంగాణ రాష్ట్ర రవాణా బంద్ పోస్టర్ల ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-05-15T04:21:52+05:30 IST
ఈనెల 19న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర రవాణబంద్ పోస్టర్లను శనివారం సీఐ టీయూ జిల్లా కార్యదర్శి ముంజం ఆనంద్కుమార్ ఆవిష్క రించారు.
కాగజ్నగర్, మే 14: ఈనెల 19న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర రవాణబంద్ పోస్టర్లను శనివారం సీఐ టీయూ జిల్లా కార్యదర్శి ముంజం ఆనంద్కుమార్ ఆవిష్క రించారు. శనివారం బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం సేఫ్టీ పేరుతో భారీ చలాన్లు విధిస్తోందన్నారు. దీన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల19న రాష్ట్రరవాణా బంద్ పాటి స్తున్నట్టు తెలిపారు. ఈ బంద్కు అన్నివర్గాల వారు సహక రించాలని కోరారు. పోస్టర్ల ఆవిష్కరణలో దుర్గం విఠల్, తాకర్ గోపాల్, ప్రసాద్, నగేష్, లచ్చన్న, తాజ్, రాజేందర్, చంద్ర, అబ్దుల్, అతిక్ పాల్గొన్నారు.