యూపీ, బిహారీలను పంజాబ్‌కు రానివ్వం

ABN , First Publish Date - 2022-02-17T07:30:08+05:30 IST

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ సోదరులను పంజాబ్‌లో అడుగు పెట్టనివ్వబోమంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ...

యూపీ, బిహారీలను పంజాబ్‌కు రానివ్వం

 ప్రియాంక సమక్షంలోనే సీఎం చన్నీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ సోదరులను పంజాబ్‌లో అడుగు పెట్టనివ్వబోమంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌షోలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక చిరునవ్వు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ తీవ్రంగా మండిపడ్డాయి. చన్నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రియాంక తనకు తాను యూపీ కూతురిగా చెప్పుకొంటారని, మరోవైపు చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఖలిస్థాన్‌కు ప్రధానమంత్రి కావాలనుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఆప్‌ వ్యవస్థాపక సభ్యుడు, ఆ పార్టీ మాజీ నేత కుమార్‌ విశ్వాస్‌ చెప్పినట్లు పేర్కొంటూ ఓ వీడియోను బీజేపీ నేత అమిత్‌ మాలవీయ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Updated Date - 2022-02-17T07:30:08+05:30 IST