నేడు 400 ప‌డ‌క‌ల కోవిడ్ ఆసుప‌త్రిని ప్రారంభించ‌నున్న సీఎం

ABN , First Publish Date - 2020-08-08T15:37:34+05:30 IST

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడా సెక్టార్ -39లో గ‌ల‌ జిల్లా ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన 400 పడకల కోవిడ్ ఆసుపత్రి....

నేడు 400 ప‌డ‌క‌ల కోవిడ్ ఆసుప‌త్రిని ప్రారంభించ‌నున్న సీఎం

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడా సెక్టార్ -39లో గ‌ల‌ జిల్లా ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన 400 పడకల కోవిడ్ ఆసుపత్రి ఈ రోజు ప్రారంభం కానుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఆసుపత్రిని ప్రారంభించ‌నున్నారు. దీనికిముందు అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ కూడా ఈ కోవిడ్ ఆసుపత్రిలోని ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించారు. ఈ కోవిడ్ ఆసుపత్రిలో సిటీ స్కాన్‌, డయాలసిస్ యూనిట్ సౌకర్యం కూడా ఏర్పాటుచేశారు. నిపుణులైన‌ వైద్యులను నియమించారు. ఈ ఆసుపత్రిలో క‌రోనా బాధితుల కోసం 400 పడకలు సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులు, ఐదవ అంతస్తులో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారు. అలాగే రెండవ అంతస్తులో డయాలసిస్ యూనిట్, సిటీ స్కాన్ వార్డులు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-08-08T15:37:34+05:30 IST