Mathura శ్రీకృష్ణ జన్మభూమిలో మద్యం దుకాణాలపై నిషేధం

ABN , First Publish Date - 2022-06-02T18:29:47+05:30 IST

మద్యం విక్రయాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది...

Mathura శ్రీకృష్ణ జన్మభూమిలో మద్యం దుకాణాలపై నిషేధం

మధుర(ఉత్తరప్రదేశ్): మద్యం విక్రయాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.పవిత్ర పుణ్యక్షేత్రాలైన అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టూ మద్యం అమ్మకాలపై నిషేధాన్ని యోగి సర్కారు ప్రకటించింది. అయోధ్యలోని మద్యం దుకాణాల యజమానుల లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. మధుర నగరంలో గురువారం నుంచి 37 మద్యం దుకాణాలను మూసివేశారు.యూపీ ప్రభుత్వం అయోధ్య, మథుర ఆలయాల చుట్టూ మద్యంపై నిషేధం విధించిందిమథురలో పాల పరిశ్రమను పునరుద్ధరించాలని ప్రభుత్వం వ్యాపారులకు సూచించింది.అయోధ్యలో మద్యం దుకాణాల యజమానుల లైసెన్సులు రద్దు చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య,మధురలోని దేవాలయాల పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధించారు. 


మధురలోని దేవాలయాల పరిసర ప్రాంతాల్లో కనీసం 37 బీర్, మద్యం, భంగ్ షాపులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.వారణాసి, బృందావనం, అయోధ్య, చిత్రకూట్, దేవ్‌బంద్, దేవా షరీఫ్, మిస్రిఖ్-నైమిశారణ్య వంటి అన్ని ప్రార్థనా స్థలాల్లో మద్యం దుకాణాలు, మాంసాహార విక్రయాలను నిషేధిస్తున్నట్లు గతంలో సీఎం యోగి ప్రకటించారు.


Updated Date - 2022-06-02T18:29:47+05:30 IST