Vaccine కోసం వెళ్తే చితకబాదిన పోలీసులు.. ఉరేసుకున్నయువకుడు

ABN , First Publish Date - 2021-07-27T21:56:56+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లిన ఓ యువకుడిని పోలీసులు లోపలికి

Vaccine కోసం వెళ్తే చితకబాదిన పోలీసులు.. ఉరేసుకున్నయువకుడు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లిన ఓ యువకుడిని పోలీసులు లోపలికి అనుమతించకపోగా, అతడిపై దాడిచేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జిల్లాలో జరిగింది.


సోమవారం వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లిన ఇరవైయేళ్ల యువకుడిని పోలీసులు అడ్డుకుని, లాఠీలతో అతడిపై దాడిచేశారు. 90 సెకండ్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఇద్దరు పోలీసులు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందులో జోక్యం చేసుకున్న ఇంకో వ్యక్తిని కూడా తోసేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఆ యువకుడు ఊరి చివరి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.


కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన బాధితులు లక్షల్లో ఉంటే.. కొన్ని చోట్ల వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర తోపులాట, వాగ్వాదాలు జరుగుతున్న సంఘటనలు కూడా ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాయి. మ‌ృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐదుగురు పోలీసులను విధుల నుంచి తొలగించారు.

Updated Date - 2021-07-27T21:56:56+05:30 IST