Viral Video: స్కూల్‌లో విద్యార్థితో మసాజ్ చేయించుకున్న టీచర్.. ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-28T15:51:10+05:30 IST

టీచర్లు చదువు చెప్పడానికి.. విద్యార్థులు చదువు నేర్చుకోవడానికి పాఠశాలకు వెళ్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ టీచర్ మాత్రం.. ఈ విషయాన్ని మర్చిపోయినట్టుంది. పాఠ

Viral Video: స్కూల్‌లో విద్యార్థితో మసాజ్ చేయించుకున్న టీచర్.. ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు.. చివరికి ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: టీచర్లు చదువు చెప్పడానికి.. విద్యార్థులు చదువు నేర్చుకోవడానికి పాఠశాలకు వెళ్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ టీచర్ మాత్రం.. ఈ విషయాన్ని మర్చిపోయినట్టుంది. పాఠశాలకు వెళ్లి మసాజ్ సెంటర్‌కు వెళ్లినట్టు ప్రవర్తించింది. విద్యార్థితో మసాజ్ చేయించుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చివరికి ఆ మేడం పరిస్థితి ఏమైందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి(Hardoi ) ప్రాంతంలోని పాఠశాలలో పని చేస్తున్న టీచర్.. అదే స్కూల్‌లో పని చేస్తున్న విద్యార్థితో మసాజ్ చేయించుకుంది. కుర్చీలో కూర్చొని ప్రాథమిక పాఠశాల విద్యార్థితో ఒళ్లు పట్టించుకుంది. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి Social Mediaలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ సదరు టీచర్‌(Teacher) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వీడియోలో ఉన్న టీచర్‌ను ఊర్మిలా సింగ్‌గా గుర్తించిన అధికారులు.. ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 




Updated Date - 2022-07-28T15:51:10+05:30 IST