బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడిని హతమార్చిన ప్రియురాలు

ABN , First Publish Date - 2020-12-12T16:47:58+05:30 IST

అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అశ్లీల వీడియోలు బహిర్గతం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో విసిగిపోయిన ఓ మహిళ తన సోదరుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన...

బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడిని హతమార్చిన ప్రియురాలు

అలీఘడ్ (ఉత్తరప్రదేశ్): అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అశ్లీల వీడియోలు బహిర్గతం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో విసిగిపోయిన ఓ మహిళ తన సోదరుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో వెలుగుచూసింది. అలీఘడ్ నగరంలోని గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన యశోదా దేవికి పారిశుద్ధ్య కార్మికుడు దీపు కాంతితో అక్రమసంబంధం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకొని దీపు కాంతి మహిళ అశ్లీల వీడియోను చిత్రీకరించాడు. అశ్లీల వీడియోను బహిర్గతం చేస్తానంటూ మహిళను వేధించాడు.


 దీంతో యశోదా దేవి తన సోదరుడు రాజ్ కుమార్ తో కలిసి దీపుకాంతిని హతమార్చారు. డిసెంబరు 10వతేదీ దీపుకాంతి మృతదేహం నాలాలో లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇతను హత్యకు గురయ్యాడని తేలింది. అక్రమ సంబంధం పెట్టుకొని, అశ్లీల వీడియో తీసి దాన్ని బయటపెడతానంటూ వేధించినందుకే తాము దీపు కాంతిని హతమార్చామని యశోదాదేవి, ఆమె సోదరుడు రాజ్ కుమార్ లు చెప్పారు. పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-12T16:47:58+05:30 IST