Viral: 20 సెకెన్లలో 40 చెప్పు దెబ్బలు కొట్టిన యువతి.. ఆమె ఆగ్రహానికి కారణమేంటంటే..
ABN , First Publish Date - 2022-09-20T02:30:20+05:30 IST
మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఓ మహిళ సరైన రీతిలో బుద్ధి చెప్పింది.
మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఓ మహిళ సరైన రీతిలో బుద్ధి చెప్పింది. రోడ్డు మీద కూర్చోబెట్టి చెప్పులతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడుస్తూ పారిపోకుండా ఆ వ్యక్తికి తగిన రీతిలో బుద్ధి చెప్పిన మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) జలౌన్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.
జలౌన్ జిల్లాలోని ఒరాయ్ నగరానికి చెందిన ఒక యువతిని తాగుబోతు వేధించాడు. అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా ఆమెను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. చాలా సేపు సహనంతో అతడి చేష్టలను భరించిన యువతి చివరకు అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తన స్నేహితులకు, బంధువులకు సమాచారం ఇచ్చి వెంటనే వారిని తను ఉన్న చోటుకు రప్పించింది. వారి సహాయంతో ఆ తాగుబోతును రోడ్డు మీద కూర్చోబెట్టి చెప్పులతో చితక్కొట్టింది. దాదాపు 20 సెకెన్ల పాటు కసితీరా చితకబాదింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.