‘పేట’ మార్కెట్ చైర్మన్గా ఉప్పల లలితాదేవి?
ABN , First Publish Date - 2020-09-23T06:55:36+05:30 IST
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉప్పల లలితాదేవి ఖరారు అయినట్లు సమాచారం. ఆమె భర్త మాజీ కోఆప్షన్
సూర్యాపేట, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉప్పల లలితాదేవి ఖరారు అయినట్లు సమాచారం. ఆమె భర్త మాజీ కోఆప్షన్ మెంబర్ ఉప్పల ఆనంద్. వైస్చైర్మన్గా ఆత్మకూర్(ఎస్) మండలానికి చెందిన మాజీ సర్పంచ్తో పాటు డైరెక్టర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. కమిటీలో 12మంది డైరెక్టర్లు ఉండగా సూర్యాపేట మునిసిపల్ చైర్పర్సన్, పీఏసీ ఎస్ చైర్మన్లు డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. దీంతో 8మంది డైరెక్టర్లును నియమించాల్సి ఉంది. నియామకానికి సంబంధించి ఉత్తర్వులను వెల్లడికావాల్సి ఉంది.