ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ది సాధ్యం
ABN , First Publish Date - 2022-05-18T05:49:05+05:30 IST
ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం అవుతుందని జగిత్యాల బల్దియా ఛైర్పర్సన్ శ్రావణి అన్నారు.
బల్దియా ఛైర్పర్సన్ శ్రావణి
జగిత్యాల అర్బన్, మే 17: ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం అవుతుందని జగిత్యాల బల్దియా ఛైర్పర్సన్ శ్రావణి అన్నారు. ప ట్టణంలోని మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం బల్దియా అధికారలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా శ్రావణి మాట్లాడుతూ గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున పట్టణంలోని అ న్ని వార్డుల్లో సమంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. పట్టణంలోని జంక్షన్ లు, రోటరీ పార్కు అభివృద్ధితో పాటు సెంట్రల్ డివైడింగ్ పనులు, వాల్ రైటింగ్, పెయింటింగ్ పనులు శరవేగంగా పెరుగుతున్నాయన్నారు. అభి వృద్ధి పనుల్లో జప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో వైస్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, నాయకులు దాసరి ప్రవీణ్, మొగిలి, డీఈ రాజేశ్వర్, ఏఈ చరణ్, ఎస్ఐ బాలెల్లంతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.