ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి

ABN , First Publish Date - 2021-06-23T06:01:07+05:30 IST

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నా రు.

ప్రజల  భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి
14వ, వార్డులో పర్యటిస్తున్న శ్రావణి

బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి

జగిత్యాల టౌన్‌, జూన్‌ 22 : ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నా రు. మంగళవారం పట్టణంలోని 8, 14 వార్డుల్లో చైర్‌పర్సన్‌ శ్రావణి పర్య టించారు. డ్రైనేజీలు, రహదారులను పరిశీలించారు. అనంతరం శ్రావణి మాట్లాడుతూ జూలై 1 నుంచి10వ, తేదీ వరకు ఏడవ హరితహారం కా ర్యక్రమంతో పాటు మూడవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వ హించనున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌, నాయకులు వానరాసి మల్లయ్య, డీఈ లచ్చిరెడ్డి, శానిటరీ ఇన్స్‌ఫెక్టర్లు మ హేశ్వర్‌రెడ్డి, అశోక్‌, విజయ్‌, రాము ఉన్నారు.

Updated Date - 2021-06-23T06:01:07+05:30 IST