యూరియాను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-01-26T02:43:38+05:30 IST
రైతులకు యూరియాను అధిక ధరకు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ
గూడూరు, జనవరి 25: రైతులకు యూరియాను అధిక ధరకు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ ఏవో నాగమోహన్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు ఎరువులు, పురుగుమందుల విక్రయ దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుకాణదా రులు యూరియాను స్టాకు పెట్టుకుని రైతులకు లేదని చెప్పినా, పురుగుమందులు కొంటేనే యూరియా ఇస్తామని తెలిపినా వారి లైసెన్స్లు రద్దుచేస్తామన్నారు. కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.