ఉరివిలో బాదుడే బాదుడు
ABN , First Publish Date - 2022-07-01T06:41:30+05:30 IST
ధరలు, పన్నులు విపరీతంగా పెం చేసి వైసీపీ పాలకులు విపరీతంగా దోచేస్తున్నారని టీడీపీ నేత, జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకట నగేష్ ధ్వజమెత్తారు.
పెడన రూరల్ : ధరలు, పన్నులు విపరీతంగా పెం చేసి వైసీపీ పాలకులు విపరీతంగా దోచేస్తున్నారని టీడీపీ నేత, జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకట నగేష్ ధ్వజమెత్తారు. ఉరివి గ్రామంలో గురువారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే కాల్వకు గండిపడి 500 ఎకరాల్లో వెదజల్లిన వరి దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. శలపాటి ప్రసాద్, గంధం గోపాలకృష్ణ, శీరం ప్రసాద్, పండ్రాజు రాంబాబు, చెన్నూరి శేఖర్, కాగిత వాసు, అర్జా రాం బాబు, నాగబాబు, మధు పాల్గొన్నారు.