ఇప్పటి వరకూ 34కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించిన అమెరికా

ABN , First Publish Date - 2021-07-25T07:40:12+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకూ 34 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వరకూ 34కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించిన అమెరికా

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకూ 34 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్స్ (సీడీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి మొత్తం 34 కోట్ల కరోనా వ్యాక్సిన్లను అడ్మినిస్టర్ చేసినట్లు సీడీసీ తెలిపింది. వీటిలో ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు ఉన్నట్లు సమాచారం. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో అమెరికా ఒకటి. ఇప్పటికీ కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశంగా అమెరికానే ఉంది. ఇక్కడ మొత్తం 3.4కోట్లపైగా కరోనా కేసులు, 6లక్షలపైగా కరోనా మరణాలు సంభవించాయి. ఎలాగైనా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలని అధ్యక్షుడు జోబైడెన్ భావిస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ ప్రారంభమైన కొత్తలో చాలా వేగంగా టీకా తీసుకున్న ప్రజలు.. ఇప్పుడు ఎందుకో వెనుకాడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది.

Updated Date - 2021-07-25T07:40:12+05:30 IST