డౌటే లేదు.. అమెరికా కరోనా మరణాలు సరిగా లెక్కించలేదు: ఫాసీ
ABN , First Publish Date - 2021-05-10T05:16:12+05:30 IST
కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ఇబ్బందులు పడిన అమెరికాలో.. ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్యను సరిగా లెక్కించడం జరగలేదని ఆ దేశ టాప్ వైద్య సలహాదారు ఆంథనీ ఫాసీ అన్నారు.
వాషింగ్టన్: కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ఇబ్బందులు పడిన అమెరికాలో.. ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్యను సరిగా లెక్కించడం జరగలేదని ఆ దేశ టాప్ వైద్య సలహాదారు ఆంథనీ ఫాసీ అన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానాలూ లేవని, కచ్చితంగా కరోనా మరణాలు తక్కువగా లెక్కించారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చూపిస్తున్న లెక్కల ప్రకారం, అమెరికాలో ఇప్పటి వరకూ కరోనా వల్ల 5,81,000 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ సంఖ్య కనీసం 9లక్షలపైగా ఉంటుందంటూ వచ్చిన ఒక విశ్లేషణపై మాట్లాడిన ఫాసీ.. ఇది తాను అనుకున్న దాని కంటే కొంచెం ఎక్కువ అని చెప్పారు. ఒక్కోసారి ఇలాంటి వాటికి ఉపయోగించే ప్రక్రియలు సరిగా పనిచేస్తాయని, కొన్నిసార్లు విఫలమవుతాయని ఫాసీ అభిప్రాయపడ్డారు.