భారత్ వెళ్లే వారికి అమెరికా హెచ్చరిక.. ఆ ప్రాంతాలకు వెళ్లొద్దంటూ..
ABN , First Publish Date - 2021-07-22T08:38:53+05:30 IST
భారతదేశానికి వెళ్లాలనుకునే తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లే పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాషింగ్టన్: భారతదేశానికి వెళ్లాలనుకునే తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లే పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత్లో రైతుల నిరసనల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. గతంలో ఇలాంటి నిరసనలు హింసాత్మకంగా మారాయని పేర్కొంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఉత్తర ఢిల్లీ సరిహద్దులు, పార్లమెంటు, రాజ్పథ్, జంతర్ మంతర్, ఇండియా గేట్ వంటి ప్రాంతాలు, జన్పథ్ వంటి ప్రాంతాలకు వెళ్లే మెట్రో రైళ్లలో ప్రయాణించొద్దని అమెరికన్లకు సూచనలు చేసింది.