పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-04T05:11:15+05:30 IST

విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను సద్వినియోగం చేసుకొని అన్నింటా రాణించాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటరాజే్‌షకుమార్‌ పేర్కొన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న జడ్జి వెంకటరాజే్‌షకుమార్‌

సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటరాజే్‌షకుమార్‌

కడప(రూరల్‌), డిసెంబర్‌ 3: విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను సద్వినియోగం చేసుకొని అన్నింటా రాణించాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటరాజే్‌షకుమార్‌ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ అధ్వర్యంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు నేడు సాధారణ వ్యక్తులకు తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. వారిలో ఉండే ఆసక్తిని, శక్తి సామార్థ్యాలను గుర్తించి వారికి మక్కువ ఉన్న రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నారు. వీరికి ప్రత్యేకంగా క్రీడలను నిర్వహించి వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని మరింతగా వెలికి తీయాలని తెలిపారు. అత్మస్థైర్యం ఉంటే ఎటువంటి లక్ష్యాలనైనా సాధించవచ్చని, చట్టాల ప్రయోజనాలను తప్పక తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానల్‌ లాయర్లు, పారాలీగల్‌ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:11:15+05:30 IST