‘జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోండి’
ABN , First Publish Date - 2021-12-04T05:32:27+05:30 IST
జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా అదనపు ఐదవ జడ్జి అమ్మన్నరాజా కోరారు.
ఆళ్లగడ్డ, డిసెంబరు 3: జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా అదనపు ఐదవ జడ్జి అమ్మన్నరాజా కోరారు. శుక్రవారం పట్టణంలోని కోర్టు ఆవరణంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్పై న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న భార్యభర్తల కేసులు, భరణం, తదితర సివిల్ కేసుల విషయంలో వారికి సహకారాలు అందించాలని న్యాయవాదులకు సూచించారు. ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి శైలజ, న్యాయవాదులు పాల్గొన్నారు.