స్వర్గపురి గేటు పక్కనే పీపీఈ కిట్లు

ABN , First Publish Date - 2021-05-09T05:44:43+05:30 IST

స్వర్గపురి గేటు పక్కనే పీపీఈ కిట్లు

స్వర్గపురి గేటు పక్కనే పీపీఈ కిట్లు

తిరువూరు, మే 8: కొవిడ్‌ మృతులను స్వర్గపురికి తరలించేందుకు వినియోగిస్తున్న పీపీఈ కిట్లు స్వర్గపురి బయటే వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించేవారు భయపడుతున్నారు. తిరువూరు నుంచి నెమలికి వెళ్లే ప్రధాన రహదారిలో పోతుల చెరువు సమీపంలో స్వర్గపురి ఉంది. పట్టణానికి చెందిన వారు కొందరు విజయవాడ, ఖమ్మంలో కొవిడ్‌కు చికిత్స పొందుతూ మృతిచెందగా వారి మృతదేహాలను పట్టణంలోని స్వర్గపురికి తరలిస్తున్నారు. వారి మృతదేహాలను స్వర్గపురికి తెచ్చేందుకు వినియోగించిన పీపీఈ కిట్లు, శానిటైజర్లు స్వర్గపురి గేటు పక్కనే పడేస్తున్నారని, గాలికి అవి రోడ్డుమీదకు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. కిట్లు ఎక్కడపడితే అక్కడ వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-09T05:44:43+05:30 IST