డీవైఈవోకు యూటీఎఫ్ వినతిపత్రం
ABN , First Publish Date - 2021-10-27T06:08:19+05:30 IST
నగరంలోని మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఎంసీ డీవైఈవో రాజు కు రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నేతలు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
పాయకాపురం, అక్టోబరు 26 : నగరంలోని మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఎంసీ డీవైఈవో రాజు కు రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నేతలు మంగళవారం వినతిపత్రం అందజేశారు. వీఎంసీలోని ఉపాధ్యాయులకు సం బంధించి ఎస్జీటీ పోస్టులను అప్గ్రేడేషన్ చేయాలని, హైస్కూల్ టీచర్లకు ఏప్రిల్ 2020 డిఫర్ శాలరీ ఇవ్వాలని, పెండింగ్ ప్రమోషన్లు ఇవ్వాలని, టీచర్ల బదిలీల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో కోరా రు. అలాగే పీఎఫ్ అకౌంట్ల అప్గ్రేడేషన్, డీఏ, బిల్లులు, తదితర సమస్యలను పరిష్కారించాలని కోరారు. నవంబరు 4లోగా సదరు డిమాండ్స్ను పరిష్కరించకపోతే నవంబరు 5నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామన్నారు. యూటీఎఫ్ నేతలు అనంత్కుమార్, కొండలరావు, కె. శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, ఎం. శ్రీనివాసరావు, సైదా సాహెబ్ పాల్గొన్నారు.